Post Office Savings Scheme Less than attractive!

పెట్టుబడి సురక్షితం .. రాబడికి హామీ .. అని చెప్పగానే వెంటనే స్ఫురించేవి జాతీయ పొదుపు పథకాలే .వీటిలో పోస్టాఫీసుల ద్వారా అందించే ఈ పథకాల మారుమూల గ్రామాల్లోనూ విస్తరించాయి . ప్రభుత్వ నియంత్రణ ఉండటం వీటికి ప్రధాన ఆకర్షణ . కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఈ పథకాల్లో అందే వడ్డీ రేట్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులు ప్రతిపాదించింది . ఏప్రిల్ ‌ 1, 2016 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులేమిటి ? వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది ?
చిన్న మొత్తాల్లో పొదుపు చేయడానికీ , దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి పెట్టడానికీ , పన్ను ఆదా కోసం .. చాలామంది ప్రజా భవిష్య నిధి , జాతీయ పొదుపు పత్రాలు , సుకన్య సమృద్ధి యోజన , పెద్దల పొదుపు పథకం తదితర పథకాలను ఎంచుకుంటారు . తగ్గుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో వీటిపై వచ్చే రాబడిపైనాకొంత కోత పడింది .

సమీక్ష .. మూడు నెలలకోసారి 

ఇప్పటివరకూ ఈ పొదుపు పథకాలపై వడ్డీని ఏడాదికోసారి నిర్ణయించేవారు . మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక నుంచి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సమీక్షించాలని నిర్ణయించారు . ఇది 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది . ఆర్థిక వ్యవస్థలో ఉన్న వడ్డీ రేట్లకు సమానంగా చేయడమే ఈ ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశమని చెప్పొచ్చు .ఇప్పటివరకూ ఒకసారి వడ్డీ రేట్లను నిర్ణయించిన తర్వాత వడ్డీ రేట్లు పెరిగినా .. తగ్గినా ఈ పథకాలపై ప్రభావం ఉండేది కాదు . ఈ కొత్త సమీక్షా విధానంతో వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారేందుకు అవకాశం ఉంది . ( Table View )
ప్రామాణిక రేటు ఆధారంగా .. 
జాతీయ పొదుపు పథకాల వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు ప్రామాణికంగా ఆయా పథకాలకు సమాన కాలవ్యవధి కల్గిన ప్రభుత్వ బాండ్ల రాబడి శాతాన్ని పరిగణనలోనికి తీసుకొని , దానికి కాస్త అదనంగా చెల్లిస్తారు .
* ఇప్పటివరకూ ఏడాది , రెండేళ్లు , మూడేళ్ల టర్మ్ ‌ డిపాజిట్లు , 5 ఏళ్ల రికరింగ్ ‌ డిపాజిట్లపై ప్రామాణికరేటుకన్నా 0.25% అధికంగా చెల్లించేవారు . దీన్ని ఇక నుంచి ప్రామాణిక వడ్డీ రేట్లకు సమానంగా చెల్లిస్తారు .
* ఐదేళ్ల టర్మ్ ‌ డిపాజిట్లు , జాతీయ పొదుపు పత్రాలు , ప్రజా భవిష్య నిధి , నెలసరి ఆదాయ పథకాలపై ప్రామాణిక రేటుకన్నా 0.25% అధికంగా చెల్లించేవారు . దీన్ని యథాతథంగా ఉంచారు .
* సంక్షేమ పథకాల జాబితాలోకి వచ్చే .. సుకన్య సమృద్ధి యోజనపై ప్రామాణిక వడ్డీ రేటుకన్నా 0.75%,పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకంపై 1% మేరకు అధికంగా వడ్డీని చెల్లిస్తారు .

ప్రభావం ఏమిటి ? 
* పొదుపు ఖాతాదార్లకు వర్తించే వడ్డీ రేటులో ఎలాంటి మార్పూ లేదు .
* టర్మ్ ‌ డిపాజిట్లు , నెలసరి ఆదాయ పథకాలు , జాతీయ పొదుపు పత్రాలు , పెద్దల పొదుపు పథకం , కిసాన్ ‌వికాస పత్రాలలో మదుపు చేసినప్పుడు వర్తించే వడ్డీ రేటే .. పూర్తి వ్యవధిపాటు చెల్లిస్తారు . కాబట్టి , ఇప్పటికే ఈ పథకాల్లో పొదుపు చేసిన వారిపై తాజా మార్పుల ప్రభావం ఏమీ ఉండదు .
* రికరింగ్ ‌ డిపాజిట్లు , ప్రజా భవిష్య నిధి , సుకన్య సమృద్ధి యోజన పథకాల్లో వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి . ఏప్రిల్ ‌ 1, 2016 నుంచి కొత్త వడ్డీ రేట్లు , కొత్త నిబంధనలు వర్తిస్తాయి .
కోత ఎందుకు ? 
వడ్డీ రేటును తగ్గించడం అంటే .. చిన్న మదుపరులు , స్వల్ప , దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేసే వారికి ఆందోళన కల్గించే విషయమే . అయితే , ఈ వడ్డీ రేట్లను తగ్గిచండం వెనుక రకరకాల కారణాలు ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి . గత కొన్నాళ్లుగా రిజర్వు బ్యాంకు 1.25% వరకూ వడ్డీ రేట్లను తగ్గించింది .ద్రవ్యోల్బణం కూడా తగ్గింది . దాదాపు అన్ని బ్యాంకులూ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 7.5%-8.00% మధ్యనే అందిస్తున్నాయి . చిన్న మొత్తాల పొదుపు పథకాలు వీటికి భిన్నంగా ఉండటం సాధ్యం కాదు . ఆర్థిక వ్యవస్థలోసమానత్వం తీసుకురావడానికి అనివార్య పరిస్థితుల్లో వడ్డీ రేట్లను తగ్గించారని అనుకోవచ్చు .
* వడ్డీ రేట్లను పరిశీలించేప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం .. వాస్తవ రాబడి ఎంత ఉంది అనేది ..ఉదాహరణకు ఒక పెట్టుబడి పథకం 9 శాతం రాబడిని అందిస్తుందనుకుందాం . ద్రవ్యోల్బణం 7 శాతం ఉంది .అప్పుడు మనకు అందే వాస్తవ రాబడి 2 శాతమే . ఒకవేళ వడ్డీ రేటు 8 శాతం , ద్రవ్యోల్బణం 5% ఉంటే ..వాస్తవ రాబడి 3 శాతంగా పరిగణించాలి . అంటే , ద్రవ్యోల్బణానికి మించి ఎంత అధిక రాబడి వస్తే ... పొదుపు చేసే వారికి అంత లాభం అన్నమాట .
* గత కొన్నేళ్లుగా జాతీయ పొదుపు పథకాలు అధిక వడ్డీ రేటునే చెల్లించాయి . అదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా ఎక్కువగానే ఉంది . అంటే , వాస్తవంగా చూసినప్పుడు అవి ప్రతికూల రాబడినే అందించాయని అనుకోవచ్చు . ప్రస్తుతం ఫిబ్రవరి నెలలో సీపీఐ ద్రవ్యోల్బణం 5.18% గా ఉంది . ఇది మరింత తగ్గే సూచనలు ఉన్నాయని అంచనా .
* ఈ నేపథ్యంలో ప్రస్తుతం సవరించిన వడ్డీ రేట్ల ద్వారా అందే వాస్తవ రాబడి ఆకర్షణీయంగానే ఉందని చెప్పుకోవచ్చు . ఇతర డెట్ ‌ పథకాలతో పోలిస్త వీటిలో నష్టభయమూ తక్కువే . ప్రభుత్వ హామీ ఉండటం కలిసొచ్చే అంశం . కాబట్టి , సురక్షితమైన ఈ పథకాలకు మీ పెట్టుబడుల్లో స్థానం కల్పించడం ఎప్పుడూ మంచిదే.
- బద్వేలు శరణ్యా రెడ్డి , సీఎఫ్ ‌ ఏ ( ఇక్ఫాయ్ ‌) , సీఎఫ్ ‌ పీ

Updates:

Follow us on WhatsApp, Telegram Channel, Twitter and Facebook for all latest updates

Post a Comment

Previous Post Next Post

Most Visited

Follow us on WhatsApp, Telegram Channel, Twitter and Facebook for all latest updates

Search Content of www.potools.blogspot.com @